Thursday, May 2, 2024

అత్యాధునిక ల‌గ్జ‌రీ వాహ‌నాన్ని కొనుగోలు చేసిన.. మెగాస్టార్

అత్యాధునిక ల‌గ్జ‌రీ వాహ‌నాన్ని కొనుగోలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది టొయోటా వెల్‌ఫైర్‌. షోరూం ధర, లైఫ్‌ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్‌ బ్లాక్‌తో కనులవిందుగా దర్శనమిస్తున్న ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70లక్షలతో టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్‌ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్‌ వచ్చారు. ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది.

ఇండియన్‌ ఫోర్‌ వీలర్‌ మార్కెట్లో బుకింగ్స్‌కు వేచి చూడాల్సిన వాహనం టొయోటా వెల్‌ఫైర్‌ కావడం విశేషం. టొయోటా నుంచి విడుదలైన ఈ వెల్‌ఫైర్‌లో అద్భుతమైన, అత్యాధునికమైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఫీచర్లతో పాటు భద్రతాపరమైన అంశాలు చాలా ఉన్నాయి. హైస్పెసిఫికేషన్స్‌తో విడుదలైన ఈ మల్టీపర్పస్‌ వెహికిల్‌లో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. మధ్య వరుసలో వీఐపీ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండటం విశేషం. ట్విన్‌ సన్‌రూఫ్‌, త్రీజోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్స్‌ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో కూడా పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్‌లో ఆటో, యాపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ చేస్తాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ ఉన్నాయి. ఇందులో ఈ వాహనం బర్నింగ్‌ బ్లాక్‌, వెల్‌ఫైర్‌ పెరల్‌ వైట్‌, గ్రాఫైట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం మైలేజీ గరిష్ఠంగా లీటర్‌కు సుమారు 16.35 కిలో మీటర్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement