Tuesday, May 21, 2024

ఎంబీఏ స్టూడెంట్ సూసైడ్.. జాబ్ లో జాయిన్ అవుతానని చెప్పి ఇలా..

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న శుశ్రీ ప్రగ్యామిత సేతి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్ లోనే ఉరేసుకుని చనిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఆమె ఈ మధ్యనే క్యాంపర్ ఇంటర్వ్యూలో జాబ్ కు సెలెక్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.

జనవరి 3న ఉద్యోగంలో చేరాలని తన తల్లిదండ్రులకు ఫోన్ చెప్పింది.. ఇంతలో అనూహ్యంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఆవేదన చెందాడు. ఆమె సూసైడ్ కి కారణం తెలియరాలేదు. మిస్టరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement