Monday, May 20, 2024

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ద్రబ్‌గామ్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.

మృతి చెందిన వారిలో లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్లు జునైద్‌ షీర్గోజ్రీ, ఫాజిల్‌ నజీర్‌ భట్‌, ఇర్ఫాన్‌ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరిలో జునైద్‌ అనే ఉగ్రవాది గత నెల 13న అమరుడైన జవాన్‌ రియాజ్‌ అహ్మద్‌ను చంపిన వారిలో ఒకడని తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, రెండు ఏకే47 రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement