Thursday, May 2, 2024

కొన్ని క్ష‌ణాల్లో పెళ్లి.. అక్క భ‌ర్త‌తో పెళ్లికూతురు జంప్…

ప్రస్తుత త‌రుణంలో ఎప్పుడు ఏం జ‌రుగుతోందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. వావి వరస, చిన్నా పెద్ద మరిచి ఎఫైర్లు నడిపిస్తున్నారు. ఇక పెళ్లి అయ్యి పిల్లలున్న వారు కూడా మరొకరిని ఇష్టపడుతున్నారు. ఇంకొందరైతే వారితో కలిసి పారిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

మరికాసేపట్లో పెళ్లి అనగా.. ఆ పెళ్లికూతురు పారిపోయింది. అది కూడా తన అక్క మొగునితో లేచిపోవ‌డం గమనార్హం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన 20ఏళ్ల యువతికి.. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన ఓ యువకునితో వివాహం కుదిరింది. ఈ మేరకు ఆదివారం పెళ్ళికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఎంతగానో ఎదురుచూస్తున్న పెళ్లి రోజు రానే వచ్చింది. అప్పటికే కొంతమంది దగ్గరి బంధువులు పెళ్లి కోసం ఇంటికి వచ్చారు. మరోవైపు పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. అంతా రెడీ అయిందని అనుకుంటున్న తరుణంలో కుటుంబసభ్యులకు వధువు షాకిచ్చింది. ఉదయం 11 గంటలకు కన్నాపూర్ లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉదయం 4 గంటలకు పెళ్లికూతురు మరో వ్యక్తితో ఉడాయించింది. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలిసి అంతా షాకయ్యారు. తన అక్క మొగుడు వరుసకు బావ అయ్యే వ్యక్తితోనే వధువు పారిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాసేప‌ట్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగిపోయింది. అయితే వధువు పారిపోయిందన్న విషయం తెలియని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకడం మొద‌లుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement