Sunday, April 28, 2024

Kerala: కట్నం కోసం పెళ్లి క్యాన్సిల్‌… డాక్టర్ ఆత్మహత్య

ఓ వ‌రుడు క‌ట్నం కోసం పెళ్లి క్యాన్సిల్ చేయ‌డంతో ఓ డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ ఘ‌ట‌న కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో చోటుచేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.

పీజీ డాక్టర్‌ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. షహానా కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అడ్వకేట్ సతీదేవి పరామర్శించారు. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మహిళా పీజీ డాక్టర్ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement