Tuesday, April 30, 2024

Mulugu: బుర‌ద‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌…గ‌ర్భంలోని శిశువు మృతి

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్..వానకు చిత్తడిగా మారిన రోడ్డులో కూరుకుపోవడంతో మహిళ కడుపులోని బిడ్డ మృతి చెందింది.

కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు మొదలవుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే, రాంనగర్ నుండి కమలాపురం వెళ్లేదారిలో వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో, స్థానికులు వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. ఈ క్రమంలో మహిళలను ఆసుపత్రికి తరలింపులో చాలా ఆలస్యం జరగడంతో ఆమె కడుపులోని శిశువు ఉమ్మనీరు మింగి మృతిచెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement