Sunday, May 26, 2024

పెళ్ళిలో కాల్పులు : ఓ వ్య‌క్తి మృతి

ఓ పెళ్లిలో కాల్పుల మోత మోగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. కాగా ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ మండ‌సోర్ జిల్లా జామునియా గ్రామంలో జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌కి సంబంధించి వీడియోను ఓ వ్య‌క్తి షూట్ చేయ‌డంతో నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే భెసోడి మండి గ్రామంలో బాబా రాంపాల్ అనే మ‌త గురువు, ఆయ‌న‌ అనుచ‌రులు నివ‌సిస్తుంటారు. జామునియా గ్రామంలో జ‌రిగిన ఓ వివాహానికి బాబా అనుచ‌రులు వ‌చ్చారు.

పెళ్లికి బాబా అనుచ‌రులు వ‌చ్చార‌న్న విష‌యం తెలుసుకున్న కొంద‌రు గ్రామ‌స్థులు కోపంతో ఊగిపోయారు. పెళ్లి ముహూర్తం స‌మ‌యంలో గుంపుగా వ‌చ్చిన గ్రామ‌స్థులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ కాల్పులు జ‌రిపారు. దీంతో పెళ్లికి అతిథిగా వ‌చ్చిన గ్రామ పెద్ద దేవీ లాల్ మీనా గాయాల‌పాలై ప్రాణాలు కోల్పోయారు. పెళ్లిలో హింస‌కు పాల్ప‌డ్డ వారిని గుర్తించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, 11 మంది నిందితుల‌ను గుర్తించారు. వారిలో ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement