Tuesday, May 7, 2024

గ్రాసరీ సేవలు మరింత విస్తృతం.. నింజాకార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న‌ ఫ్లిప్‌కార్ట్‌.. వాల్‌మార్ట్ సంస్థలు..

తాజా ఉత్పత్తుల సప్లయి చైన్‌ కంపెనీ.. నింజాకార్ట్‌, ఫ్లిప్‌ కార్ట్‌లు యూఎస్‌ ఆధారిత మాతృ సంస్థ వాల్‌మార్ట్‌ ఇంక్‌ నుంచి 145 మిలియన్‌ డాలర్లను సేకరించింది. భారతదేశ అగ్రిటెక్‌ రంగంలో అతిపెద్ద డీల్‌ అని భారతీయ ఈ-కామర్స్‌ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు నింజాకార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ మూడు సార్లు పెట్టుబడులు పెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌.. తన 90 నిమిషాల ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారాన్ని.. ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ 2022 చివరి నాటికి 200 నగరాలకు విస్తరింపజేస్తున్న సమయంలో ఈ డీల్‌ వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ పెట్టుబడితో.. తాజా కేటగిరీలో నాణ్యమైన, సరసమైన ధరలకు కిరాణా సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ-గ్రోసరీకి ఎంతో డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. తమ కిరాణా వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు వివరించారు. ఈ నిధులు నింజాకార్ట్‌ పారదర్శకమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని సహ వ్యవస్థాపకుడు తిరుకుమారన్‌ నాగరాజన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement