Friday, May 17, 2024

కాంగ్రెస్ కుట్ర‌లు ఓడిపోయాయి : జ‌గ‌దీష్ రెడ్డి

టీఆర్ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఓడి పోయాయని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ విజయం సాధించడం పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు. ఈ గెలుపు తో టిఆర్ఎస్ పార్టీ ని మరింత బలోపేతం చేసుకుని 12 అసెంబ్లీ స్థానాల్లో12 గెలుచుకుంటామని స్పష్టం చేశారన్నారు. ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ లోని రెండు స్థానాల్లో మొత్తంగా 6 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కోటిరెడ్డికి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజారిటీ ఇచ్చి గెలిపించారని పేర్కొన్నారు. తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన కాంగ్రెస్ నల్గొండ జిల్లాలో కుట్ర పూరితంగా పని చేసిందని మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement