Tuesday, April 30, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిలసాడాయి. చివరిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే కనిష్టాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు తమ మార్కెట్లపై ప్రభావం చూపాయి.

సెన్సెక్స్‌ 398.18 పాయింట్ల నష్టంతో 57527.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 131.85 పాయింట్ల నష్టంతో 16945.05 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 99 రూపాయలు పెరిగి 59664 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 331 రూపాయలు పెరిగి 70543 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.62 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, అపోలో ఆస్పటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయి షేర్లు..

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎం అండ్‌ ఎం, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, టైటాన్‌ కంపెనీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్‌ ్స, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement