Thursday, May 2, 2024

Serious Warning | భూ కబ్జాదారులకు మావోయిస్టుల హెచ్చరిక.. పద్ధతి మారకుంటే శిక్ష తప్పదు

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై మావోయిస్టులు కన్నెర్ర చేశారు. ఐటీడీఏ వెనకాల ఉన్న చెరువు సర్వే నెంబర్​ 111/5లోని 4.15 ఎకరాల ప్రభుత్వ భూమిని పలు రాజకీయ పార్టీ నేతలు రెవెన్యూ, పోలీసుల అండతో ఆక్రమించుకుంటున్నారని ఇవ్వాల (మంగళవారం) విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్​ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. జల్​ జంగిల్​, జమీన్​ నినాదం.. దోపిడీకి గురవుతున్న ప్రజల నినాదంగా మారాలని మావోయిస్టు బీకే ఏఎస్​ఆర్​ డివిజన్​ కార్యదర్శి ఆజాద్​ పిలుపునిచ్చారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నేతలకు సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. లేఖ పూర్తి వివరాలు దిగువన చూడొచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement