Friday, April 19, 2024

బిగ్ స్క్రీన్ పై మరోసారి అలరించనున్న రామ్, భీమ్.. రీ-రిలీజ్ కు రెడీ అయిన ఆర్ఆర్ఆర్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. గత ఏడాది మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. భారీ కలెక్షన్ల రికార్డులతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులని సైతం దక్కించుకుంటూ దూసుకెళుతోంది ఈ మూవీ.

ఇక ఇటీవల యుఎస్ఏ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసిని ఈ మూవీకి అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కాగా, ఇప్పుడు ఈ ఇండియాలో రీ-రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల (మార్చి) 10న ఇండియా వైడ్ 200 థియేటర్స్ లో రీ-రిలీజ్ చేసేందకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు మేకర్స్. అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ అలానే నార్మల్ ఆడియన్స్ సైతం మరొక్కసారి ఈ భారీ మూవీని వెండితెరపై చూసేందుకు సంసిద్ధం అవుతున్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుని ఆస్కార్ కి నామినేట్ కాగా.. మార్చి 13న జరుగనున్న ఈ ఆస్కార్ అవార్డుల ఈవేంట్ కోసం ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ చేరుకున్నారు. ఇక, త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులు కూడా యుఎస్ఏ చేరుకోనున్నారు. మరి ఈ సినిమా ఆస్కార్ ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరొక్క వారం ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement