Wednesday, May 1, 2024

ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో యువ‌కుడిని చంపిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పోలీస్‌ ఇన్ఫార్మర్‌ నెపంతో ఓ వ్యక్తిని హత్యచేశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి… బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు తెర్రం గ్రామానికి చెందిన తాతి సంజయ్‌గా గుర్తించారు. తెర్రం, పెగడపల్లి రోడ్‌లో సంజయ్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల లేఖ లభ్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement