Sunday, April 28, 2024

ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు..

మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఓ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు కార్మికులు ఈ మంట‌లు, పొగ‌ల్లో చిక్కుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముండేగావ్ సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఒక బాయిలర్‌ భారీ శబ్ధంతో పేలింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. వెంటనే పలు అగ్నిమాపక వాహనాలు ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సుమారు 11 మంది కార్మికులను రక్షించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. చాలా మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. బాయిలర్‌ పేలుడుకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement