Thursday, May 2, 2024

మ‌నీశ్ సిసోడియాతో పాటు మ‌రో 13మందికి లుక్ అవుట్ నోటీసులు -ఏంటీ డ్రామా అంటోన్న ఉప ముఖ్య‌మంత్రి

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియాతో పాటు మ‌రో 13మందికి సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ఆదివారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా సహా మొత్తం 14 మంది పేర్లు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసు అనేది ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయ‌వ‌చ్చు. ఈ నోటీసుపై మనీశ్ సిసోడియా స్పందిస్తూ.. ఇదేం డ్రామా అంటూ ప్రధాని మోడీపై మండిపడ్డారు. మీ దాడులన్నీ అయిపోయాయి. ఏమీ దొరకలేదు. ఒక్క పైసా కూడా లభించలేదు. ఇప్పుడు మనీశ్ సిసోడియా అందుబాటులో లేరని లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఏంటి మోడీజీ ఈ జిమ్మిక్కు . నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి. మీరెక్కడున్నారో నాకు కనిపించడం లేద‌ని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement