రాజకీయాల్లోకి సినిమా యాక్టర్స్ వెళ్లడం పరిపాటే. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు పలు పార్టీలలో స్థిరపడ్డారు.కాగా సీనియర్ హీరోయిన్ త్రిషని తమ పార్టీలోకి ఆహ్వానించిందట కాంగ్రెస్. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులను పార్టీల్లో చేర్చుకోవడం ద్వారా గ్లామర్ లుక్ తీసుకురావాలని పార్టీలన్నీ యోచిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ త్రిషను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడామె లేని లోటును త్రిష ద్వారా తీర్చాలని కాంగ్రెస్ భావిస్తున్నారట. ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల త్రిష ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్ సైట్లు కొన్ని కథనాలు రాశాయి. మరోవైపు, తమిళనాడులో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా త్రిష వైపే చూస్తున్నట్టు సమాచారం.త్రిష కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతోందట.
Advertisement
తాజా వార్తలు
Advertisement