Sunday, May 5, 2024

Manipurలో మళ్లీ హింస…13 మంది బలి..

కొన్ని రోజులుగా ఘర్షణలు లేకుండా ఉన్న మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస ప‌డ‌గ విప్పింది.. గ‌డిచిన 24 గంట‌ల‌లో జరిగిన జాతి ఘర్షణలతో 13 మంది మ‌ర‌ణించారు.. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో కాల్పులు జరిపింది. దీనితో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా కాల్పుల మోత దద్దరిల్లింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ.. మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో దాడికి పాల్పడిందని.. అనంతరం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల‌లో 13 మంది మ‌ర‌ణించ‌గా,27 మంది గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement