Sunday, April 28, 2024

శ్రీవారి సేవ‌లో కొత్త జంట‌..

తిరుమల శ్రీవారిని కొత్త జంట‌ మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం నూతన వధూవరులకు వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పొందారు.. వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం మ‌నోజ్ మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల ప్రేమ వివాహ బంధంతో మరింత గ‌ట్టిప‌డినందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని అన్నారు.. వివాహం అనంతరం తిరుమలకు జంట‌గా రావడం సంతోషంగా ఉందని సంతోషం వ్య‌క్తం చేశాడు నాన్న ఆశీస్సులు, అక్క సపోర్టు, అత్తమామల ఆశీస్సులు ఉన్నంత వరకు తమను ఎవరు ఏమీ చేయలేరన్నారు. ఇక తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని అంటూ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉందన్నారు. మౌనిక కూడా సేవ చేయాలని ఉంటే ఆమెకు తన సపోర్టు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement