Tuesday, April 30, 2024

ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి

యూపీలో తనను మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్‌పై ఓ యువ‌తి యాసిడ్ దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో 28 ఏళ్ల దేవేంద్ర రాజ్‌పుత్ మ‌ర‌ణించాడు. ఆగ్రాలోని హ‌రిప‌ర్వ‌త్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జరిగింది. మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెలిసిన ఆ యువ‌తి త‌న బాయ్‌ఫ్రెండ్‌పై యాసిడ్ దాడి చేసింది. తీవ్రంగా శ‌రీరం కాలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ప్రైవేట్ ల్యాబ్‌లో ప‌నిచేస్తున్న దేవేంద్రరాజ్‌పుత్ అదే ల్యాబ్‌లో పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ గ‌త కొన్నాళ్లుగా ఓ అద్దె ఇంట్లో ఉంటూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే అబ్బాయి త‌ల్లితండ్రులు మ‌రో యువ‌తితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న అత‌ని ప్రేయ‌సి ఆగ్ర‌హానికి గురైంది. సీలింగ్ ఫ్యాన్‌ను రిపేర్ చేయాలంటూ ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి ర‌మ్మ‌ని చెప్పింది. అతడు ఇంటికి రాగానే కోపంతో యాసిడ్ చ‌ల్లింది. కాగా దాడి చేసిన మ‌హిళ‌ను సోన‌మ్‌గా గుర్తించారు. బాయ్‌ఫ్రెండ్‌పై యాసిడ్ చ‌ల్లిన యువతి కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోన‌మే త‌న కుమారుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసిన‌ట్లు యువకుడి తల్లిదండ్రులు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement