Wednesday, May 15, 2024

కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం… కండీషన్స్ అప్లయ్ – మమతా బెనర్జీ

కోల్‌కతా: – కాంగ్రెస్ పార్టీ పట్ల ఒంటి కాలమీద లేచే పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్వరం మారుతోంది.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఆమె ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని కండీషన్‌ పెట్టారు. ప్రతిపక్షాల ఐక్యతపై ఈ మేరకు తొలిసారి నోరు విప్పారు. ఆ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘కాంగ్రెస్ బలంగా ఉన్న చోట, వారిని పోరాడనివ్వండి. మేం వారికి (కాంగ్రెస్‌కు) మద్దతు ఇస్తాం. అందులో తప్పు లేదు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు కూడా వారు (కాంగ్రెస్‌) మద్దతు ఇవ్వాలి’ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు కావాలంటే ఆ పార్టీ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల హవా ఉన్న చోట వాటికే సీట్లు కేటాయించాలని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement