Sunday, May 5, 2024

India | గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ వేకి గ్రీన్​ సిగ్నల్.. ఢిల్లీ-కోల్​కతా మధ్య 3వేల కోట్లతో రహదారి

దేశంలోని రెండు అతిపెద్ద నగరాలను కలుపుతూ నిర్మించనున్న ఎక్స్​ప్రెస్​ హైవే పనులకు కేంద్రం ఓకే చెప్పింది. వారణాసి-కోల్‌కతా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వేకు గ్రీన్​ సిగ్నల్​ వచ్చినట్టు ఇవ్వాల (సోమవారం) అధికారులు తెలిపారు. రూ. 3000 కోట్ల విలువైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వే 2026 నాటికి సిద్ధమవుతుందని.. ఢిల్లీ, కోల్​కతా వంటి రెండు అతిపెద్ద నగరాల మధ్య జర్నీ టైమ్​ సేవ్​ అవుతుందని అధికారులు అంటున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఢిల్లీ–కోల్​కతా మెట్రోపాలిటన్​ నగరాల మధ్య గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్ హైవేని నిర్మించనున్నారు. ఇది మోహనియా, రోహ్తాస్, ససారం, ఔరంగాబాద్, గయా, ఛత్ర, హజారీబాగ్, రాంచీ, బొకారో, ధన్‌బాద్, రామ్‌ఘర్, పురూలియా, బంకురా, పశ్చిమ్ మెదినీపూర్, హౌరా, హుగ్లీ మీదుగా వెళుతుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. వారణాసి సమీపం.. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో భూ సేకరణ పూర్తయిందని.. అయితే వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక కోసం వెయిట్​ చేస్తున్నట్టు తెలిపారు.

2021 సెప్టెంబర్​లో జరిగిన సమావేశంలో కీలక నగరాలను కలుపుతూ.. సమయం,  వ్యయాన్ని తగ్గించేలా వారణాసి-కోల్‌కతా ఎక్స్ ప్రెస్‌వే అలైన్‌మెంట్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి ఆమోదించారు. ఈ ఎక్స్ ప్రెస్‌వేపై జర్నీ ‘విమానం లాంటి’ అనుభూతిని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ రహదారిలో జర్నీ చేయాలనే ఇంట్రెస్ట్​ ప్రయాణికులకు కలిగేలా రహదారి నిర్మాణం చేపడతామని అధికారులు అంటున్నారు. ఇటీవల, పూర్వాంచల్, లక్నో-ఆగ్రా.. యమునా ఎక్స్ ప్రెస్‌వేల నిర్మాణం తర్వాత  జర్నీ టైమ్​ చాలామటుకు తగ్గిందని, నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

కోల్‌కతాకు ప్రయాణించే వారి కోసం సాధారణంగా ఉపయోగించే హైవే NH-19.. ఇది కూడా గోల్డెన్ చతుర్భుజిలో వస్తుంది. ఈ రహదారి ఎక్కువగా ఆరు-లేన్ల విస్తరణతో పాటు అనేక నాలుగు-లేన్ల విస్తరణలను కలిగి ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపిన వివరాల ప్రకారం..  ఢిల్లీ నుండి కోల్‌కతాకు నియంత్రిత ఎక్స్ ప్రెస్ వే వారణాసి రింగ్ రోడ్ నుండి ప్రారంభమై పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా సమీపంలో NH-16ని కలుస్తుంది. దీని నిర్మాణం కోసం.. బీహార్‌లోని తిలోతు నుండి ఇమామ్‌గంజ్ వరకు 80 కిలోమీటర్ల సెక్షన్‌ను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ రహదారి కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement