Friday, May 3, 2024

మల్లూరు క్షేత్రాన్ని మరో యాదగిరిగుట్టగా తీర్చిదిద్దాలి.. కల్యాణోత్సవంలో పాల్గొన్న సీతక్క..

మాల్లురు హేమాచల లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రాన్ని మరో యాదగిరి గుట్టగా ప్రభుత్వం తీర్చిదిద్దాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇవ్వాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోనే యాదాద్రి తర్వాత రెండో దైవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన క్షేత్రం మల్లురు లక్ష్మినరసింహ స్వామీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. గొప్ప చరిత్ర కలిగిన స్వామీ కరుణ కటాక్షాలు ములుగు ప్రాంత ప్రజలకు కలగాలని సీతక్క మొక్కుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement