Monday, May 6, 2024

150 మిలియన్ వ్యూస్ తో సర్కారివారి ‘పాట’..

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా మైత్రీ – 14 రీల్స్ సంస్థ నిర్మించిన సినిమా స‌ర్కారువారి పాట‌.. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఫస్టు సింగిల్ గా వచ్చిన ‘కళావతి’ పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట ఇంకా అదే స్పీడ్ తో దూసుకుపోతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకి సిధ్ శ్రీరామ్ స్వ‌రాన్ని అందించాడు.

అయితే తాజాగా ఆ పాట 150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రీచ్ అయ్యి అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

కాగా.. మహేశ్ బాబు జంట‌గా కీర్తి సురేశ్ కథానాయికగా అలరించింది. బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకి భారీ యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండనుంది. సముద్రఖని.. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా మే 12వ తేదీన విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement