Sunday, April 28, 2024

సొంతగూటికి చేరిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాధా అమర్…

మహబూబ్ నగర్, (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చలువగాలి రాధా అమర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు ఆదివారం హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన రాధా అమర్ రాజకీయ పరిణామాల కారణంగా 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ లో చేరారు.అంతేకాక 2018 ఎన్నికలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపులో తమ వంతు పాత్రను పోషించారు. ఆ తర్వాత రాజకీయ, వ్యక్తిగత కారణాలతో అధికార పార్టీకి దూరం అయ్యారు.ఈ మేరకు రాధా అమర్ దంపతులతో పాటు, అమరేందర్ సోదరులు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి  ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement