Monday, April 29, 2024

నిజమేనా..? కరోనా టీకాతో వృద్ధురాలికి తిరిగొచ్చిన కంటిచూపు

కరోనా టీకా వేయించుకున్న తర్వాత తన కంటి చూపు తిరిగి వచ్చిందని ఒక వృద్ధురాలు తెలిపింది. మహారాష్ట్రలోని వాషిమ్‌కు చెందిన 70 ఏండ్ల మధురాబాయి బిద్వేకు తొమ్మిది ఏళ్ల కిందట రెండు కళ్లలో చూపు పోయింది. తన బంధువుల వద్ద ఉంటున్న ఆమె, జూన్‌ 26న కోవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నది. ఆ మరునాడు తన ఒక కంటిలో కొంతమేర చూపు వచ్చినట్లు మధురాబాయి తెలిపింది. 30-40 శాతం మేర చూడగలుగుతున్నట్లు చెప్పింది. అయితే ఆ వృద్ధురాలి మాటల్లో ఎంత వరకు వాస్తవం ఉందో వైద్యులు నిర్ధారించలేదు.

కాగా మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్‌ అనే వృద్ధుడు కోవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత తనకు అయస్కాంత శక్తి వచ్చిందని ఇటీవల తెలిపాడు. ఇనుప వస్తువులు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని చెప్పాడు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా తీయగా అది సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement