Tuesday, May 7, 2024

Mahabubabad : ఘోర రెడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు యువ‌కులు మృతి..

బైక్, ట్రాక్ట‌ర్ ఢీకొని ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందిన ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని తొర్రూరు మండ‌లంలోని సోమారం గ్రామంలో బైక్‎ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement