Sunday, April 28, 2024

మ‌హా పాద‌యాత్ర‌లోమాజీ మంత్రి జేడీ శీలం..పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న మ‌హిళ‌లు..

గుంటూరు : రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అయితే వైసీపీ మిన‌హా అన్ని పార్టీల నేత‌లు ఈ ఉద్య‌మానికి సంఘీభావం తెలిపారు. కాగా ఈ పాద‌యాత్ర‌లో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అమ‌రావ‌తి కోసం కేంద్రంపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉందని జేడీ శీలం తెలిపారు. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం పండ‌గ పూట ఇల్లు..పిల్ల‌ల్ని వ‌దిలి రైతులు రోడ్డెక్క‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రైతుల ఇంట దీపావ‌ళి వెలుగులు క‌రువ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ పాద‌యాత్ర‌లో పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొన్నారు. అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement