Monday, May 20, 2024

సుకేశ్ గ‌దిలో ల‌గ్జ‌రీ వ‌స్తువులు.. అక‌స్మిక త‌నిఖీ చేసిన అధికారులు

ప్ర‌స్తుతం జైలు జీవితం గ‌డుపుతున్నాడు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈయ‌న ఢిల్లీలోని మండోలి జైలులో ఉంటున్నాడు.కాగా సుకేశ్ గ‌దిని అధికారులు ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆ త‌నిఖీలో అనేక ల‌గ్జ‌రీ వ‌స్తువులు బ‌ట‌య‌ప‌డ్డాయి. జైలు గ‌దిలో 1.5 ల‌క్ష‌ల విలువైన గుక్కి సాండ‌ల్‌ను గుర్తించారు. సుమారు 80 వేల ఖ‌రీదైన రెండు జ‌త‌ల జీన్ పాంట్ల‌ను కూడా గుర్తించారు. జైల‌ర్ దీప‌క్ శ‌ర్మ‌తో పాటు ఇత‌ర ఆఫీస‌ర్లు కాన్‌మాన్ సుకేశ్ గ‌దిలో విచార‌ణ‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో అత‌ని గ‌దిలో ఖ‌రీదైన వ‌స్తువులు ఉన్న‌ట్లు గుర్తించారు. జైల‌ర్ గ‌దిలోకి వ‌చ్చిన స‌మ‌యంలో సుకేశ్ బోరున ఏడ్చేశాడు. సెల్‌లో ఓ మూల‌న నిలుచుని క‌న్నీరుపెట్టుకున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.అయితే సుకేశ్ జైలు గ‌ది విజువ‌ల్స్ లీకైన అంశంపై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు జైలు అధికారులు వెల్ల‌డించారు.200 కోట్ల మ‌నీల్యాండ‌రింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నోరా ఫ‌తేహ్‌ల‌ను కూడా పోలీసులు ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement