Saturday, May 4, 2024

ప్రేమికుల మ‌ధ్య చిచ్చు పెట్టిన టీష‌ర్ట్ – మెట్రో ట్రైన్ లో ప్రియుడిని చిత‌క‌బాదిన ప్రియురాలు

ఓ టీష‌ర్ట్ ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఢిల్లీ మెట్రోలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘటనలో ముందుగా అమ్మాయి తాను వేసుకున్న టీ షర్ట్ ధర రూ.1000 అని చెప్పగా.. దానికి అబ్బాయి రూ.150 కూడా ఈ టీ షర్ట్ దొరుకుతుంది అని సరాదాగా సమాధానమిచ్చాడు. దీంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ముందు, వెనుక చూడకుండా ప్రేమికుడిని కొట్టడం మొదలుపెట్టింది.అంతేకాదు అమ్మకు చెప్తానంటూ చిన్నపిల్లలాగా మారాం చేసింది.

దీంతో అప్పటిదాకా ఓపికతో ఉన్న ఆ బాయ్‌ఫ్రెండ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. నీలాంటి లవర్ ఎవరికీ ఉండకూడదు అని అమ్మాయి ముఖంమీదే చెప్పేశాడు. దీంతో మళ్లీ అతడిని కొట్టడం మొదలుపెట్టింది ఆ యువతి. ఆ గొడవ జరుగుతుండగానే స్టేషన్ రావడంతో వారిద్దరూ దిగిపోయారు. యువ‌తీ యువ‌కుల చర్యతో అవాక్కైన ప్రయాణికులు వారు దిగిపోగానే నవ్వుకున్నారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.నెట్టింట్లో కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది ఈ వీడియో.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement