Sunday, April 28, 2024

LIVE from New Delhi – ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందజేసిన న‌రేంద్ర మోడీ

YouTube video

న్యూఢిల్లీ – దేశంలోని 70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ పంపిణీ చేశారు. ఉపాధి మేళా కార్యక్రమం కింద ఈ నియామకాలను పంపిణీ చేస్తున్నారు. వచ్చే ఏడాదిన్నరలో మిషన్‌ విధానంలో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాది జూన్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి మేళా కార్యక్రమం కింద నేడు దేశవ్యాప్తంగా 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపాధి మేళా కింద 70 వేల మంది యువతకు ఉద్యోగాల కోసం నియామక పత్రాలను ప్రధాని మోడీ పంపిణీ అందజేశారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ఉపాధి మేళాలో పాల్గొని యువతకు సందేశం ఇచ్చారు… . అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement