Friday, April 26, 2024

సీఎం కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకులు

నల్గొండ జిల్లా హాలియాలో ఈ నెల 14న సీఎం కేసీఆర్ పాల్గొననున్న భారీ బహిరంగ సభకు లైన్ క్లియర్ అయ్యింది. కరోనా నేపథ్యంలో లక్ష మందితో నిర్వహించనున్న ఈ సభకు అనుమతి ఇవ్వొద్దని స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. రేపు, ఎల్లుండి తెలంగాణ హైకోర్టుకు సెలవులు కావడంతో.. సీఎం కేసీఆర్ సభ ఎల్లుండి యథావిధిగా జరగనుంది. కాగా కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేస్తున్నారని, తక్షణమే సభను రద్దు చేయాలని బీసీ సంఘాలు, రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement