Sunday, April 28, 2024

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విలయ తాండవం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 3,187 పాజిటివ్ కేసుల నమోదు కాగా, అదే సమయంలో ఏడుగురు మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 20,184 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.27 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకు 3.05 లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌ బారిన పడి మొత్తం 1,759 ప్రాణాలు విడిచారు.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు: హైదరాబాద్- 551, మేడ్చల్- 333, రంగారెడ్డి- 270, నిజామాబాద్- 251, కామారెడ్డి- 113, జగిత్యాల- 134, ఆదిలాబాద్- 92, కరీంనగర్- 104, ఖమ్మం- 79, మహబూబ్ నగర్- 73, మంచిర్యాల- 59, మెదక్- 53, నల్లగొండ- 83, నిర్మల్-154, రాజన్న సిరిసిల్ల- 57, సంగారెడ్డి- 104, సిద్దిపేట- 81, సూర్యాపేట- 55, వికారాబాద్- 68, వనపర్తి- 59, వరంగల్ అర్బన్- 98, యాద్రాద్రి భువనగిరి- 60.

Advertisement

తాజా వార్తలు

Advertisement