Monday, April 29, 2024

ఏపీలో భారీగా కరోనా కేసులు.. లాక్‌డౌన్ తప్పేలా లేదుగా..?

ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా 758 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 127, విశాఖ జిల్లాలో 98, కృష్ణా జిల్లాలో 80, అనంతపురం జిల్లాలో 56, తూ.గో. జిల్లాలో 45, నెల్లూరు జిల్లాలో 33, ప్రకాశం జిల్లాలో 30, కర్నూలు జిల్లాలో 27, శ్రీకాకుళం జిల్లాలో 27, కడప జిల్లాలో 24, విజయనగరం జిల్లాలో 23, ప.గో. జిల్లాలో 13 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,95,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3,469గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,201గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement