Monday, May 6, 2024

ఉమ్మడి కరీంనగర్ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్.. ఎన్నికల విషయమై చర్చలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. సోమవారం రాత్రి ప్రగతిభవన్లో ఉమ్మడి కరీంనగర్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల విషయంపై కూలంకుశంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, రమణ, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రమేష్ బాబు, డాక్టర్ సంజయ్, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, సతీష్ బాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement