Saturday, April 27, 2024

భక్తుల మనోభావాలను పవన్ కళ్యాణ్ దెబ్బతీశారట

తిరుపతి ఉపఎన్నికల సభలో వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. ‘వైసీపీకి ఓటు వేయడం వెంకన్నకు ద్రోహమే’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉపఎన్నికలో బ్రాహ్మణులంతా బీజేపీ- జనసేన కూటమికి బుద్ధి చెప్పాలని సతీష్ శర్మ పిలుపునిచ్చారు. బీజేపీ హిందుత్వ ముసుగులో బ్రాహ్మణులను మోసం చేస్తోందని విమర్శించారు. అటు చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీలో తొలగించిన మిరాశీ అర్చకులకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకుని ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement