Thursday, May 2, 2024

కడియంకు శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని రవీందర్..

దంతాలపల్లి ప్రభన్యూస్ : ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరికి మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు, దాట్ల సర్పంచ్ కొమ్మినేని రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండలోని కడియం నివాసంలో స్థానిక నాయకులతో కలిసి కడియం శ్రీహరికి పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వారివెంట గున్నేపల్లి గ్రామ సర్పంచ్ గండి వెంకటనారాయణగౌడ్,ఇమ్మడి వెంకటేశ్వర్లు,నల్ల ఆంజనేయులు, గుండగాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement