Thursday, April 25, 2024

త‌ల‌తిక్క మాట‌లొద్దు..బండి సంజ‌య్ పై మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్..

తెలంగాణ రైతుల నోటిలో మ‌ట్టి కొట్టే ప్ర‌య‌త్నం బిజెపి చేస్తుంద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిప‌డ్డారు. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైరయ్యారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాటకాలు అడుతుందని ఘాటుగా విమర్శించారు. బండి సంజయ్ తలతిక్క మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం యాసంగిలో వడ్లను సాగు చేయాలని అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. గతంలో యాసంగిలో కొన్న ధాన్యాన్నే కేంద్రం సేకరించలేదని.. ఇప్పుడు వానాకాలం పంటకు కిరికిరి పెడుతున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు, ప్రాణాలు బీజేపీకి పట్టవని విమర్శించారు. యాసంగిలో వడ్లు సాగు చేస్తే కేంద్రం కొంటుందో, కొనదో చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్లు వేయకుంటే ఏ పంటను సాగు చేయాలో .. కేంద్రమే చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement