Sunday, May 12, 2024

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోంది.. పాల్వాయి స్రవంతి

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి తనకు బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడా ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు. ఈసందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తానని చెప్పారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కోరానని, మునుగోడు ప్రచారానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని వెంకట్ రెడ్డి తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు.

అయితే రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. లీకైన ఆడియో టేప్ ప్రకారం.. వెంకట్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ సానుభూతిపరుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతూ.. పార్టీ చూడకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. చావైనా, పెళ్లైనా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడని అన్నారు. ఉపఎన్నికల తర్వాత తాను పీసీసీ చీఫ్‌గా ఎన్నికై, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పుడు అందరిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియాలో మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్దితి లేదని అటువంటపుడు తాను వెళ్లి ప్రచారం చేయడం అనవసరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నమ్మక ద్రోహంగా ఉన్నాయన్నారు. తనకు ఆర్థిక బలం లేకపోవచ్చు కానీ.. ప్రజాబలం ఉందని స్రవంతి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement