Monday, April 29, 2024

Record | సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. అరుదైన రికార్డు

క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజున భార‌త జ‌ట్టు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ తన 29వ టెస్టు సెంచరీని నమోదు చేసుకున్నాడు. 180 బంతుల్లో 10 ఫోర్ల‌తో 314-4 వద్ద కింగ్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. ఐదొంద‌ల అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో శ‌త‌కం సాధించిన మొద‌టి క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (664), ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509) వంటి ఆట‌గాళ్లు 500పైగా మ్యాచులు ఆడిన.. వారెవరూ 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపోయారు. 2018 భారత్ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత విదేశాల్లో కోహ్లీకి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. కాగా, ఈ బ్యాటర్ ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లలో భారతదేశం తరపున 76 సెంచ‌రీల‌ను కలిగి ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement