Friday, May 17, 2024

రూ.20 కోట్ల కోసం బాలుడి కిడ్నాప్‌, హత్య

పుణలోని పింప్రి-చించ్వాడకు చెందిన ఏడేళ్ల బాలుడు సెప్టెంబర్‌ 8వ తేదీన అదృశ్యమయ్యాడు. బాలుడి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలుడి తండ్రికి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.20 కోట్లు ఇస్తే, బాలుడిని విడుదల చేస్తామని చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులకు బాలుడి తండ్రి తెలియజేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ కాల్‌ ఆధారంగా సోదాలు నిర్వహించి, ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, బాలుడిని కిడ్నాప్‌ చేసి, హత్య చేసినట్లు వెల్లడించారు.

నిందితులు కూడా అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారే. బాలుడి తండ్రి వ్యాపార వేత్త కావడం. అతని దగ్గర డబ్బు ఉన్నట్లు గుర్తించి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement