Friday, May 3, 2024

Man Eater – ఆ పులిని చంపేయండి

తిరువనంతపురం: వయనాడ్‌ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వయనాడ్‌కు చెందిన ప్రజీశ్‌ (36) శనివారం గడ్డి కోయడానికి వెళ్లగా పులి దాడి చేసి చంపేసింది.

శరీరంలో కొంత భాగాన్ని తినేసింది. ఆ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి సృష్టించింది. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించొద్దంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అటవీ శాఖ ఆ పులిని అంతమొందించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పులి మనుషులను చంపి తినే రకమా? కాదా? అనేది ధ్రువీకరించుకోవాలని స్పష్టంచేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement