Monday, April 29, 2024

డ్రగ్స్​ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్తే.. పోలీసులపైనే రివర్స్​ అటాక్​.. నలుగురికి కత్తిపోట్లు

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కల్లంబలం వద్ద డ్రగ్స్ కేసులో ఓ నిందితుడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో నలుగురు పోలీసు అధికారులు కత్తిపోట్లకు గురయ్యారు. నిందితుడిని మహ్మద్ అనాస్‌గా గుర్తించారు. దాడి అనంతరం అతడిని అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

డ్రగ్స్ కేసులో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లంబలం పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులపై అనాస్ దాడి చేశాడు. అతడి ఆచూకీపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ దాడిలో పోలీసులు చందు, జయన్, శ్రీజిత్, విమోద్, విజిత్ గాయపడ్డారు. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో, మరో ఇద్దరు పారిపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement