Monday, May 6, 2024

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డికి పితృ వియోగం .. ప‌రామ‌ర్శించిన కేసీఆర్ ..

గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు సీఎం కేసీఆర్. కృష్ణ‌మోహ‌న్ రెడ్డి తండ్రి వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌లే మ‌ర‌ణించారు. వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గ‌ద్వాల వ‌చ్చారు కేసీఆర్ . ఈ సంద‌ర్భంగా బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. కాగా కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement