Friday, April 26, 2024

కేసీఆర్ హౌస్ ప్రారంభానికి సిద్ధం : మంత్రి గంగుల

రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 31న ప్రారంభించనున్న కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌజ్ పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్, గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement