Thursday, May 9, 2024

జోగులాంబ సేవ‌లో కెసిఆర్ కుటుంబం..

వనపర్తి: జోగులాంబ గద్వాల: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి గ్రూప్ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. అంత‌కు ముందు గద్వాల జిల్లాలోని శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్గమధ్యంలో వనపర్తిలోని కొత్తకోటలో గల పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రకృతి వనంలో మొక్కలు నాటారు‌. కవితకు స్థానిక టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement