Thursday, May 2, 2024

కారు ప్రమాదంలో ఎడమ కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్

నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదానికి గురైన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఎడమ కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒక కంటైనర్ లారీని కత్తి మహేష్ కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర‌గాయాలైన విష‌యం తెలిసిందే. ప్ర‌మాద స‌మ‌యంలో ఎయిర్ బ్యాగ్స్ తెర‌చుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న త‌ల‌, ముక్కు,కంటికి గాయాల‌య్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆయ‌న‌ను చెన్నైకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రిలో కత్తి మ‌హేష్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయ‌న రెండు క‌ళ్ల‌కు నేడు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఎడ‌మ కంటి చూపు పూర్తిగా పోయింద‌ని వైద్యులు అంటున్నార‌ని ఆయ‌న మేన‌మామ ఎం. శ్రీరాములు మీడియాతో చెప్పారు. మెద‌డులో ఎలాంటి రక్త‌స్రావం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల‌న మ‌హేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement