Sunday, May 5, 2024

మంత్రి రాసలీల కథ రూట్ మారింది !!

కర్ణాటక రాసలీల మంత్రి కథ రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ ముందు హాజరైన బాధిత యువతి సమాధానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. విధాన సభకు వెళ్లిన మంత్రి రమేష్ ను అక్కడే కలిశాను. ఆయన తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. మల్లేశ్వరి పీజీ అని సేవ్ చేసుకున్నాను. ఆయన తమకు సహకరించాలని కోరారు. ఆ ప్రాంతంలో ఆయన బలమైన నేత కావడంతో తో ఎదురించలేకపోయాను. రెండు మూడు సార్లు శారీరకంగా కూడా వాడుకున్నాడు. ఎందుకైనా మంచిది ఎప్పటికైనా పనికివస్తాయని వీడియోలను రికార్డ్ చేశాను.

కానీ నా ఫ్రెండ్స్ శ్రవణ్, నరేష్ ఇద్దరికి వీడియో కాపీలను ఇచ్చాను. మరో కాపీ నా దగ్గర ఉంచాను అని చెప్పింది. కానీ ఆ వీడియోలు ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆమె అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లవలసి వచ్చింది, వీడియోని బయటకు రిలీజ్ చేయ వలసిన అవసరం ఏమొచ్చింది…అనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement