Wednesday, May 8, 2024

క‌ల్యాణం క‌మ‌నీయం ట్రైల‌ర్ ని రిలీజ్ చేసిన.. హీరోయిన్ అనుష్క‌

క‌ల్యాణం క‌మ‌నీయం మూవీ ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు హీరోయిన్ అనుష్క‌. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భర్తకి ఉద్యోగం లేకపోవడం .. భార్య ఫీల్ కావడం .. భార్య జాబ్ చేస్తుంది కదా అని భర్త ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం .. అదే వారిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించడం ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. భారీ సినిమాల మధ్య థియేటర్లకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ – ప్రియా భవాని శంకర్ జంటగా న‌టించారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టైటిల్ వినగానే, ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ అనే విషయం తెలిసిపోతూనే ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందనే సంగతి అర్థమైపోతూనే ఉంది. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement