Sunday, April 28, 2024

బీహార్ లో కల్తీ మద్యం తాగి 73 మంది మృతి.. కీలక నిందితుది అరెస్ట్…

బీహార్ లో కల్తీ మద్యం తాగి 73 మంది మృతి చెందారు.. ఈ కేసులో కీలక నందితుడినీ పోలీసులు అరెస్ట్ చేశారు.. వివరాలు ఇలా ఉన్నాయి… బీహార్‌లోని స‌ర‌న్ జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం తాగి 73 మంది మృతిచెందగా.. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్ర‌ధాన నిందితుడిని ప‌ట్టుకున్నారు. నిందితుడిని రామ్ బాబు మ‌హ‌తోగా గుర్తించామని క్రైం బ్రాంచ్ క‌మీష‌న‌ర్ ర‌వీంద్ర సింగ్ యాద‌వ్ తెలిపారు. బీహార్‌లో మ‌ద్య నిషేధం ఉంద‌ని, అయితే ఆ అవ‌కాశాన్ని వాడుకుని, త్వ‌ర‌గా డ‌బ్బు సంపాదించాల‌న్న ఆలోచ‌న‌తో నిందితుడు క‌ల్తీ మ‌ద్యం అమ్మ‌కాల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement