Thursday, May 2, 2024

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య లేఖ‌

తన భర్తను కిడ్నాపర్ల తరహాలో పోలీసులు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జర్నలిస్ట్ రఘు భార్య ప్రవీణ లేఖ రాశారు. సోషల్ మీడియలో వైరల్ అయిన తర్వాత అరెస్ట్ అని పోలీసులు తెలిపారంటూ లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు, కొందరు భూ కబ్జాదారుల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రవీణ ఆరోపించారు. తన భర్తతో పాటు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, భావ ప్రకటన హక్కును కాలరాసే విధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరించారని తెలిపారు. ఉదయం 9:45 గంటలకు ఎత్తుకెళ్లి మధ్యాహ్నం 12:45 గంటలకు అరెస్ట్ చేసినట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు లెటర్ ఇచ్చారని ఆమె వివరించారు. కోర్టు జోక్యం చేసుకోకుంటే ప్రభుత్వ వ్యవస్థలు, భూకబ్జాదారులు రఘును హత్య చేస్తారని ఆమె ఆవేదన చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement